మైసూర్ పాక్
కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 500 గ్రా
పంచదార - 800 గ్రా
నెయ్యి -500 గ్రా
తయారీ:
కావలిసిన వస్తువులు:
సెనగ పిండి - 500 గ్రా
పంచదార - 800 గ్రా
నెయ్యి -500 గ్రా
తయారీ:
- సెనగ పిండి జల్లిడ పట్టి పక్కన వుంచుకోవాలి.
- ఒక దళసరి గిన్నిలో పంచదార పోసి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి, సన్నని సెగ మీద తీగ పాకం రానివ్వాలి.
- నెయ్యి కూడా ఒక గిన్నిలో పోసి బాగా మరగనివ్వాలి. పంచదార తీగ పాకం రాగానే మరిగే నెయ్యి రెండు గరిటలు పాకంలో పోస్తే పాకం బాగా గుల్ల బారుతుంది.
- అప్పుడు సెనగ పిండి కూడా పాకంలో కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలుపుతూ పిండి అంతా పోసెయ్యాలి.
- మంట బాగా తగ్గించి మరిగే నెయ్యి కూడా కొద్దికొద్దిగా పోస్తూ మొత్తం పొయ్యలి.
- మైసూరు పాక్ బాగా పొంగి గుల్ల విచ్చుతుంది.
- ఒక పళ్ళేనికి నెయ్యి రాసి అందులో పొయ్యాలి .
- వేడి మీద ఉన్నప్పుడు సమానముగా చేసి చాకుకు నెయ్యి రాసి ముక్కలు కోసుకోవాలి.
- ఆరిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. పది రోజులు నిల్వ ఉంటాయి
No comments:
Post a Comment