పెసరట్టు
కావలిసిన వస్తువులు:
పెసలు - 250 గ్రా
బియ్యం - 50 గ్రా
పచ్చిమిర్చి - 5-6
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2 tsp
ఉప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్ (సన్నగా)
నెయ్యి/నూనె
తయారీ:
కావలిసిన వస్తువులు:
పెసలు - 250 గ్రా
బియ్యం - 50 గ్రా
పచ్చిమిర్చి - 5-6
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2 tsp
ఉప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్ (సన్నగా)
నెయ్యి/నూనె
తయారీ:
- పెసలు, బియ్యం కలిపి 2-3 గంటలు నానపెట్టుకోవాలి. నానిన తరువాత కడిగి అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- రుబ్బిన పిండిలో జీలకర్ర వేసి కలుపుకోవాలి.
- పెనం మీద గరిటెడు పిండి దోశలాగా వేసుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్క చల్లి చుట్టూ నెయ్యి కానీ నూనెగాని వేసి కాలిన తరువాత వేడిగా అల్లం పచ్చడితో గాని వేరే పచ్చడితో వడ్డించాలి.
No comments:
Post a Comment